Fire In Visakha - Nanded Train : విశాఖ-నాందేడ్ రైల్లో సాంకేతిక లోపం | DNN | ABP Desam

విశాఖ నుంచి నాందేడ్ బయల్దేరాల్సిన రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఏసీ కోచ్ వీల్స్ పట్టేశాయి. దీంతో ఏసీ కోచ్ కింద నుంచి మంటలు చెలరేగాయి. మంటలకు భయపడిన ప్రయాణికులు రైలు నుంచి కిందకి దిగేశారు. సిబ్బంది సకాలంలో గుర్తించి మంటలను ఆర్పేయటంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను ఆర్పేశాక ప్రమాదం లేదని నిర్ధారించుకుని రైలు ను కదిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola