రామతీర్థం కొండ పై ప్రోటోకాల్ వివాదం
విజయనగరం, రామతీర్థం బోధికొండ పై ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రోటోకాల్ బోర్డు పై మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు పేరు కనిపించకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఇది సర్కస్ కాదు మీ ఇష్టమొచ్చినట్టు చేయటానికన్నారు. ఒక దశ లో అలసట కు గురయ్యారు. పోలీసులు నచ్చజెప్పి శాంతపరిచారు. రామతీర్థం ఆలయ కమిటీ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు వ్యవహరిస్తున్నారు.