వంగవీటి రాధాకు 2+2 గన్ మెన్ లు కేటాయించాలని సీఎం జగన్ ఆదేశం
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నాని కలిశారు. తనను చంపేందుకు రెక్కీ చేశారంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాధాకు 2+2 గన్ మెన్ ను ఇచ్చి భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాధాపై రెక్కీ నిర్వహించిన వారు ఎవరో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించారు. రాధా పై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement