Tirupati: దేవుళ్ళు.కామ్... ఇచ్చట శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు అధిక ధరకు అమ్మబడును

శ్రీవారి క్యాలెండరు, డైరీలకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు రాజమండ్రికి చెందిన దేవుళ్ళు.కామ్ (మోహన్ పబ్లికేషన్స్) నిర్వాహకులు సిద్దమయ్యారు. అందినకాడికి భక్తులను దోచుకోవాలని నిర్ణయించిన ఈ కేటుగాళ్ళు 2022వ సంవత్సరం టీటీడీ క్యాలెండరు, డైరీలను ఆన్ లైన్లో భక్తులకు విక్రయాలను ప్రారంభించారు.వాటి ధర కంటే రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. 12 పేజీల క్యాలెండరు ధర 130 రూపాయలు కాగా ఆన్ లైన్లో దీని ధరను 198 రూపాయలకు విక్రయిస్తుండగా.. ఇక 150 రూపాయల డైరీని 243 రూపాయలకు విక్రయిస్తున్నారు. క్యాలెండరు, డైరీలు ఆన్ లైన్ లో అధిక ధరలకు విక్రయిస్తున్న సమాచారం టీటీడీ దృష్టికి రావడంతో టీటీడీ అప్రమత్తంమైంది..విరివిగా క్యాలెండరు,డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచామని, టీటీడీ విక్రయశాలలో భక్తులు వాటిని కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మోహన్ పబ్లికేషన్స్ పై టిటిడి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola