Tirupati: తిరుపతి లో ఆ ఊర్లో ఎటు చూసినా పలకరించేది సమస్యలే.
ABP Desam
Updated at:
06 Dec 2021 11:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల వ్యవధిలో రెండు సార్లు కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలోని వాగులు, వంకలు,నదులు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.చిత్తూరు జిల్లా, తిరుపతి రూరల్ మండలం, మూలపల్లె గ్రామంకు రాకపోకలు సాగించే వంతెన కొట్టుకుని పోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.. గ్రామంను వదిలి వెళ్ళే మార్గం లేక దాదాపుగా నెల రోజుల పాటు నరకయాతన అనుభవిస్తున్నారు. వంతెన తెగి పోవడంతో గ్రామం విడిచి వెళ్ళే మార్గం లేక నిత్యవసర సరుకులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.