Tirupati: సూపర్ మార్కెట్ లో దొంగలు పడ్డారు

తిరుపతి, చంద్రగిరి పట్టణం నడిబొడ్డున దొంగలు రెచ్చిపోయారు. రెండు ప్రముఖ దుకాణాల్లో చొరబడి సుమారు 10 లక్షల రుపాయల నగదు మరో 4 లక్షల విలువైన వస్తువులు కాజేసారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, చంద్రగిరిలోని కొత్తపేట వద్థ గల చేగు సూపర్ మార్కెట్, చేగు ఆగ్రో ఎంటర్ ప్రైజర్స్ భారీ చోరీ జరిగిందని బాధితుడు చేగు గోవర్ధన్ గుప్తా చెప్పారు. రాత్రి దుండగులు రాడ్ల సాయంతో షెటర్స్ తెరచి లోనికి ప్రవేశించారు. సూపర్ మార్కెట్ లో సుమారు 3 లక్షల నగదు, మరో రెండు లక్షల విలువైన వస్తువులను దోచేశారు. అలాగే పక్కనే ఉన్న చేగు ఆగ్రో ఎంటర్ ప్రైజర్స్ లో చొరబడి 4 లక్షల రూపాయద నగదు 5 లక్షల విలువైన విలువైన మోటార్లు, కాపర్ వైర్స్ చోరీ జరిగిందని బాధితుడు చేగు గోవర్ధన్ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola