Tirumala: తిరుపతిలో ప్రారంభమైన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

దేశం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అవినీతి అడ్డంకిగా మారిందని టీటీడీ సివిఎస్వో గోపీనాథ్ జెట్టి అన్నారు. అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు వారి స్థాయిలో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా టీటీడీ పరిపాలన భవనం నుంచి అలిపిరి టోల్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది చేత అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola