Tirumala SriVari Hundi Collection : కలియుగ వైకుంఠనాధుడి హుండీలో కాసుల గలగలలు | ABP Desam

టీటీడీ చరిత్రలోనే రికార్డు స్థాయి హుండీ ఆదాయం నమోదైంది. ఆగస్టులో 22 లక్షల 22 వేల మంది స్వామి వారిని దర్శించుకోగా వారు సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం 140 కోట్ల రూపాయల 34 లక్షలు వచ్చింది. గడచిన రెండు నెలల రికార్డులను తుడిచిపెట్టేస్తూ టీటీడీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం ఒకే నెలలో స్వామి వారి హుండీలోకి చేరింది. జులైలో 139 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రాగా, జూన్ లో 130 కోట్ల రూపాయల హుండీ ఆదాయం స్వామి వారికి భక్తులు సమర్పించుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola