Sai Teja: చిత్తూరుకు చేరుకున్న సాయితేజ పార్థివదేహం.. ర్యాలీగా స్వగ్రామానికి తరలింపు
ABP Desam
Updated at:
12 Dec 2021 11:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహం బెంగళూరు నుండి చిత్తూరుకు చేరుకుంది. నిన్న రాత్రి బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ క్యాంప్నకు చేరుకోగా.. నేటి ఉదయం రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లాకు చేరుకుంది. పుంగనూరు రోడ్డు మార్గం గుండా సాయితేజ స్వగ్రామమైన ఎగువరేగడకు ర్యాలీగా తరలిస్తున్నారు. చిత్తూరుకు చేరుకోగానే ముందుగా అభిమానులు, స్నేహితులు నివాళులు అర్పించిన తరువాత ర్యాలీ ప్రారంభంమైంది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన సాయితేజకు అంతిమ వీడ్కోలు పలికేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.