సాయానికై వేచి చూస్తున్న తిరుపతి వాసులు
నెల వ్యవధిలో రెండు సార్లు వచ్చిన తుఫాన్ దాటికి నేటికి తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు దయనీయమైన పరిస్థితులను గడుపుతున్నారు. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. ఎటు చూసినా వరద నీటి ప్రవాహంతో ప్రజలు దిక్కు తోచని స్ధితిలో పడ్డారు.. వరద నీరు ఇళ్లలోకి రావడంతో దాదాపుగా వారం రోజులు పైగా నిద్రాహారాలు మాని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంత వాసులు.వరద ధాటికి విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో విద్యుత్ సరఫర ఎక్కడికక్కడ నిలిచి పోయింది.