Leopard Caught In Tirumala: ముగిసిన టీటీడీ ఆపరేషన్ చిరుత

తిరుమల శేషాచలం అడవుల్లో ఆపరేషన్ చిరుత ముగిసింది. ఎట్టకేలకు నాలుగో చిరుతను అధికారులు విజయవంతంగా బంధించారు. వారం రోజుల నుంచి ఈ చిరుతను ట్రాప్ చేసేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. రోజూ బోను దాకా వచ్చి చిరుత వెనుదిరగడం జరుగుతూ వస్తోంది. బంధించేందుకు అధికారులు అనేక రకాల వ్యూహాలను అమలుచేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత ట్రాప్ కు గురైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola