దేశసేవ చేయాలనేది చిన్నతనం నుంచే సాయితేజ లక్ష్యం

సీడీఎస్ బిపిన్ రావత్ చాపర్ ప్రమాదంలో తన అన్న సాయి తేజను కోల్పోవటం ఎవరూ తీర్చలేని లోటని ఆయన సోదరుడు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలోని సాయి తేజ స్వగ్రామం ఎగువరేగడలో ఆయన పార్థివదేహం కోసం కుటుంబసభ్యులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. ఏబీపీ దేశంతో మాట్లాడిన మహేష్...తన అన్న సాయితేజ స్పూర్తితోనే తను కూడా ఆర్మీలో చేరి దేశసేవ చేస్తున్నాని చెప్పాడు. చిన్నతనం‌ నుండి దేశ సేవ చేయాలనే ఆశయంతో సాయితేజ ఆర్మీలో చేరాడని, పోలీసు అవ్వాలన్న తనను కూడా ఆర్మీలో చేరేమని ప్రోత్సహించాడని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్న మహేష్ తో మా ప్రతినిధి రంజిత్ ముఖాముఖి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola