Tiger Wandering In Palnadu Area: పులిని పట్టుకునేందుకు అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు

Continues below advertisement

పల్నాడు ప్రాంతంలో పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. దుర్గి మండలం మాచర్ల, వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో ప్రధానంగా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఆవును చంపి గజాపురం ప్రాంతంలో పులి అడవిలోకి వెళ్లిందని భావిస్తున్న చోట అటవీ శాఖ అధికారులు కెమెరాలు ఏర్పాటు చేశారు. పులులు నీటి కోసం వచ్చే అవకాశం ఉన్న చోట్ల కూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో పులి పాదముద్రలు, ఆనవాళ్ల కోసం కూడా గాలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram