Chittoor : చిత్తూరుకు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరుకు మద్యం బాటిళ్లు తరలిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు చిత్తూరు తాలూకా పోలీసులకు పట్టుబడ్డారు.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.. వారి నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే రెండు కార్లు, 10 లక్షల రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం తీసుకుని ముగ్గురు నిందితులను చిత్తూరు తాలూకా పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 31వ తేదీన సాయంత్రం కర్ణాటక నుంచి మద్యం బాటిళ్లను అక్రమంగా చిత్తూరుకు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిపై హయ్యత్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద తాలూకా ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేసి పట్టుకున్నామన్నారు.