రైతుల పాదయాత్రలో టిడిపి నేతల ఎంట్రీపై వైసిపి ఎమ్మెల్యే కాకాని కౌంటర్..! |

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు అవరోధం ఎదురైన సంగతి తెలిసిందే. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వారిని ఇబ్బంది పెట్టారని, కనీసం బస చేయడానికి స్థలం కూడా ఎవరూ ఇవ్వకుండా అడ్డుకున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ఎపిసోడ్ పై, తనపై వచ్చిన విమర్శలపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. అమరావతి పాదయాత్రను అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని, అయితే అది పాదయాత్ర కాదని ఓ రాజకీయ యాత్ర అని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola