ఆంధ్రాలో అరాచక పాలన కొనసాగుతోందన్న తులసిరెడ్డి

కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో అరాచక పాలన, ఆటవిక పాలన కొనసాగుతోందన్నారు. మంత్రి కొడాలి నాని , ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలవల్ల వైకాపాకు తీవ్ర నష్టం జరుగుతుందని, అలా చేయవద్దని చెప్పినందుకు తమ సొంత పార్టీ కార్యకర్తపైనే దాడి చేయడం తప్పని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola