మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణ పనులను అడ్డుకుంటూ జేసీబీ తొట్టెలో ఆందోళన

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లులోని సర్వే నంబర్ 125 లో సొసైటీ బహుళ ప్రయోజన కేంద్రం( మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్)కి రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనుభవదారులు నిర్మాణ పనులను అడ్డగించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వీరిని అడ్డుకోగా ఓ పెద్దాయన జేసీబీ తొట్టెలో కూర్చుని ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola