Nellore rains: మోకాలి లోతు నీళ్లలోనే ఆఫీస్ కు అధికారులు .| ABP Desam

చుట్టూ వరదనీరు, ఆస్పత్రి ప్రాంగణం అంతా వరదనీటిలో మునిగి ఉంది. కానీ విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల, విద్యుత్ సబ్ స్టేషన్ ఇలా వరదనీటిలో ఉండిపోయింది. అయితే వరదనీటిలోనుంచే విధులకు వెళ్లారు. సోమవారం ఉదయాన్నే విధులకు వచ్చిన వైద్య సిబ్బంది ఇలా వరదనీటిలోనే లోపలికి వెళ్లారు. వరదల్లాంటి అత్యవసర సమయాల్లో వైద్య సిబ్బంది అవసరం ఎంతైనా ఉంది.కనీసం ఆఫీస్ ల లోకి వెళ్లేందుకు సైతం దారి లేదు. మోకాలి లోతు నీళ్లలోనే అధికారులు సిబ్బంది, ఫైల్స్ తలపై పెట్టుకుని ఆఫీస్ ల లోకి వెళ్లారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola