ప్రచారం నమ్మొద్దంటున్న పోలీసులు

నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా వరద ముప్పు ఈ ఏడాది బీభత్సం సృష్టించింది. అసలు వరద ముంపు లేని ప్రాంతాల్లో సైతం ఈ ఏడాది నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ప్రజలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా కోవూరు ప్రాంతంలో భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు పెడుతున్నారు. మరోవైపు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమశిల జలాశయానికి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టిందని ప్రస్తుతం ప్రాజెక్ట్ వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola