నెల్లూరు జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు, నిందితుల అరెస్ట్| DNN | ABP Desam

నెల్లూరు జంట హత్యల కేసుని పోలీసులు ఛేదించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. హోటల్ లో పనిచేసే శివ, రామకృష్ణ జంటహత్యలు చేశారని నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు. గతంలో హోటల్ యజమానులు మందలించడంతో అది మనసులో పెట్టుకున్నారు. అలాగే.. హోటల్ ఆదాయాన్ని కాజేయాలనే దురాశతో.. హత్య చేశారని ఎస్పీ విజయరావు ప్రకటించారు. 2011లో శివ ఆ హోటల్ లో పనికి కుదిరాడని, 11 ఏళ్లపాటు నమ్మకంగా పనిచేసి, ఇప్పుడీ పనికి పాల్పడ్డాడని చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola