Minister Mekapati : నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి మేకపాటి పర్యటించారు. రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకు కాన్వాయ్ లో వెళ్లారు మంత్రి. అయితే వరదల వల్ల ఇప్పటికి కూడా ఆత్మకూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. వీర్లగుడిపాడు వద్ద వరదనీరు నిలిచిపోయి ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరద తీవ్రంగా ఉన్నప్పుడు పునరావాస కేంద్రంల్లో తలదాచుకున్న గ్రామస్తులు, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నడుంలోతు నీళ్లలోనే ఊరికి చేరుకున్నారు. వారిని చూసేందుకు మంత్రి ఇలా పడవలో, జేసీబీలో ప్రయాణం చేసి వెళ్లారు. అప్పారావుపాలెం గిరిజన కాలనీకి వెళ్లేందుకు కిలోమీటర్ మేర బురదనేలపైనే మంత్రి నడిచి వెళ్లారు. ఓచోట మంత్రి ఏమాత్రం ఆధారంలేకుండా పిట్టగోడపై నిలబడి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. వారందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. ప్రభుత్వం తరపున ఇప్పటికే పరిహారం అందించామని, ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.