Nara Lokesh Vijayawada Court:టీడీపీని ఏం చేయలేక కరోనా కేసులు పెట్టుకున్నారు|ABP Desam
TDP జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. 2020లో అచ్చెన్న అరెస్టు సమయంలో లోకేశ్ అవినీతి నిరోధక శాఖ కోర్టు వద్దకు రాగా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయస్థానానికి హాజరయ్యారు. తనపై ఇప్పటికే 14కేసులు పెట్టారని.. మరో 10కేసులు పెట్టుకున్నా ఏమి చేయలేరని అన్నారు.