Nara Lokesh: ఏసీ రూముల్లో కూర్చుని వైసీపీ రాయించిన ఏకపక్ష కమిటీ రిపోర్టులు చెల్లవు

ఏసీ రూముల్లో వైసీపీ రాయించిన ఏకపక్ష కమిటీ రిపోర్టులతో ప్రభుత్వం కక్షసాధిస్తోందని నారా లోకేష్ అన్నారు. అనంతపురంలో ఎస్ఎస్‌బీఎన్ లో విద్యార్థులను కలిసిన లోకేష్ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎయిడెడ్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎదురునిలిచి పోరాడిన విద్యార్థులను ఈ సందర్భంగా లోకేష్ అభినందించారు. అనంతరం మాట్లాడిన ఆయన.....ఆరు రోజుల్లో కమిటీ రిపోర్టు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. ఎయిడెడ్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన తప్పదని లోకేష్ హెచ్చరించారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola