ఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిపత్తు సమయంలో కూడా రాజకీయాలు చేస్తూ దిగజారిపోతున్నారని వైఎస్ జగన్పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. ఈ ఆపద కాలంలో బాధ్యతగా ఉండాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా రాజకీయాలు చేసిన వైఎస్ జగన్ ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉండడం దురదృష్టకరం అని అన్నారు. పరిస్థితులను, ప్రజలను పావులుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాకముందే ఇంత పెద్ద విపత్తు వచ్చిందని, సాయం చేసేందుకు ముందుకు రాకుండా ఇవేం మాటలు అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సాయం చేస్తామంటే ప్రభుత్వం అడ్డు చెప్పలేదని తేల్చి చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తు వస్తే ప్రజల కోసం ముందుకొచ్చి సహకారం అందించినట్టు గుర్తు చేశారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. కానీ జగన్ మాత్రం హడావుడిగా వచ్చి బుడమేరుకు గేట్లున్నాయని ఏవేవో మాట్లాడి వెళ్లిపోయారని సెటైర్లు వేశారు.