ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది..ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారు
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ పతన స్థితికి చేరుకుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన....కేంద్రం ఇప్పటికైనా పట్టించుకుని ఏపీలో పరిస్థితులను చక్కదిద్దాలన్నారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితికి మించి అదనంగా మూడులక్షల కోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేసిందని కనకమేడల ఆరోపించారు.