రాయలసీమకు నీటి వనరుల్లో అన్యాయంపై చర్చావేదిక- ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు

నీటి వనరుల వినియోగంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అనంతరపురం జిల్లా హిందూపురంలో చర్చావేదిక ను నిర్వహించారు. రాయలసీమకు జిల్లాలకు చెందిన రైతులు, మేధావులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా రాయలసీమ జిల్లా తెదేపా నేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. హంద్రీనీవా, కృష్ణాజలాల వివాదాల కారణంగా రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తు ఏంటనే అంశంపై వాడీవేడి చర్చ జరిగింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola