Meda Vijaya Shekar Reddy : వరద సమయంలో రాజకీయాలు చేయడం తగదన్న వైసీపీ నాయకులు
అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం లో వైసీపీ ఇసుక మాఫియా కారణమని ప్రతిపక్షాలు ఆరోపణలు నిరాధారం అని, వరద బాధితులకు ఆపన్నహస్తం అందించాల్సిన పరిస్థితి లో రాజకీయాలు చేయడం తగదని రాజంపేట వైసీపీ నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి అన్నారు. రాజంపేట సుండుపల్లి మండలంలో దాదాపు వరద బాధితులకు 380 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇంత వేగంగా విపత్తు సమయంలో స్పందించలేదని, తుఫాను వచ్చిన వారం రోజులకే పరిహారం చెక్కులు బాధితులకు అందాయన్నారు.