Rahul Gandhi Bharat Jodo Yatra: తమ సమస్యలు చెప్పుకున్న అమరావతి రైతులు
కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో ఉన్న భారత్ జోడో యాత్రకు అమరావతి రైతులు, పోలవరం నిర్వాసిత రైతులు హాజరయ్యారు. రాహుల్ గాంధీని కలిసి తమ సమస్యలు వివరించారు. దీనిపై రాహుల్ సానుకూలంగా స్పందించి.... తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచుతామన్నారు.