కర్నూలో మహిళ మృతదేహంతో నిరసనలో ఉద్రిక్తత..
కర్నూలులోని బంగారు పేటలో ఉద్రిక్తత నెలకొంది. కేసీ కెనాల్ వెనక రోడ్డును మున్సిపల్ అధికారులు వెడల్పు చేపట్టారు. దీంతో అడ్డంగా ఉన్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. దీంతో నీలి షికారీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇళ్ల కూల్చివేతతో మనస్తాపానికి గురై మృతి చెందిందిన లక్ష్మీ మృతదేహంతో బంగారు పేట నుండి కలెక్టర్ కార్యాలయం వరకూ షికారీల నిరసన ర్యాలీ నిర్వహించారు. షికారీల నిరసనను పోలీసులు అడ్డుకుని వారిని వాహనంలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు.