JC Prabhakar reddy: తగ్గేదేలే అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి... చివరికి పంతం నెగ్గించుకున్నారు...

జేసీ బ్రదర్స్ ఏం చేసిన హాట్ టాఫిక్కే.. తొడలు కొట్టడం, మీసాలు మెలిపెట్టడంలో వారికి వారే సాటి. అనంతరపురంలోనే కాదు రాష్ట్రంలో తాడిపత్రి రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి. 

మొన్న మీసం మేలిపెట్టారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టరాంటే చూడండి ఆయన ప్రతాపం ఎంత దూరం వెళ్లిందో. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే కేతిరెడ్డికి మధ్య రాజకీయ జగడం ఎప్పటి నుంచో నడుస్తోంది. సవాల్ కు ప్రతి సవాల్....దాడికి ప్రతి దాడులు సైతం జరిగిపోతుంటాయి. 

తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి మళ్లీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సారి ఏం జరిగిందంటే మున్సిపల్ ఛైర్మన్ హోదాలో సమావేశం పెడితే అధికారులు డుమ్మా కొట్టారని, ఇదంతా పెద్దిరెడ్డి పని అని కోపంతో ఊగిపోతున్నారు. రాత్రంతా తాడిపత్రి మున్సిపల్ ఆఫీసులో నిద్రాహారాలు చేసేశారు. ఉదయమే స్నానాలు, అనంతరం హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన నిరసన విరమించారు.  అధికారులు వచ్చి జేసీకి వివరణ ఇవ్వడంతో ఆయన కమిషనర్, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola