Kurnool: కరోనా కారణంగా మూతపడుతున్న ప్రైవేట్ స్కూల్స్.. అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న యజమానులు, ఉపాధ్యాయులు
బడి భారమవుతోంది. విద్యార్థులకు కాదు. ఉపాధ్యాయులకు, యజమానులకు. అప్పులు కట్టలేక అల్లాడిపోతున్నారు యజమానులు. కర్నూలు జిల్లాలో దంపతుల ఆత్మహత్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కరోనా కారణంగా చాలా రంగాలు మూతపడే పరిస్థితికి వచ్చేశాయి. ఇప్పుడు ప్రైవేటు స్కూల్స్ పరిస్థితి కూడా అలానే ఉందని వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.