KA Paul on Chandrababu Pawan Kalyan | చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ ఫైర్ | ABP Desam

Continues below advertisement

 టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మండిపడ్డారు. రెండు కేంద్రమంత్రి పదవుల కోసం ఏపీ ప్రయోజనాలు మోడీ దగ్గర తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు పాల్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఇటు ఎన్డీయే కూటమి ఆదివారం కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోడీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram