Guntur Watchmen Murder: గుంటూరు నగరంలో అర్ధరాత్రి దారుణం
గుంటూరులో నిన్న అర్ధరాత్రి దారుణం జరిగింది. కాస్త గ్యాప్ లోనే ఇద్దరు వాచ్ మెన్లు దారుణ హత్యకు గురయ్యారు. అరండల్ పేట్ లోని లిక్కర్ మార్ట్, అమరావతి రోడ్డులోని యమహా షోరూం వాచ్ మెన్లను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.... మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.