ప్రజల శ్రేయస్సు కోసం పోరాటాలు చేయక తప్పటం లేదు

శ్రీకాకుళం జిల్లా పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అథోగతి పట్టించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. సచివాలయాలకు రంగులు వేయటం లాంటి తుగ్లక్ పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బతీశారన్నారు.ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో తితిలీ పరిహారం రెట్టింపు ఇప్పిస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారన్నారు. సంపూర్ణ గృహ హక్కు కోసం ప్రభుత్వం ప్రజలపై 10,000 రూపాయాలు కట్టమనడం బాధాకరమన్న గౌతు శిరీష....నివసిస్తున్న గృహాలకు పన్నులు ఇన్నేళ్లుగా కడుతున్నారని అదే చాలని గౌతు శిరీష అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola