Fire Accident In Anantapur Penukonda Forest: వందల ఎకరాలు కాలి బూడిదయ్యాయి | ABP Desam
Anantapur జిల్లా Penukonda నియోజకవర్గ వ్యాప్తంగా అటవీ ప్రాంతంలో వందల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టారని... ఏళ్ల తరబడి జాగ్రత్తగా పెంచుకున్న వృక్ష సంపద బూడిదైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం జరుగుతుందేమో అని అడవికి దగ్గరలో ఉండే గ్రామాలవారు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.