Cricket ఆటలో అస్వస్థత..వైద్యుల నిర్లక్ష్యంతో మృతి అంటున్న బంధువులు | Narsaraopeta| ABP Desam

అన్యాయంగా తమ కుమారుడిని చంపేశారంటూ పల్నాడు జిల్లా నరసారావు పేటలో మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. శివసంజీవయ్య కాలానికి చెందిన బత్తుల మల్లికార్జున(22) క్రికెట్ ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోవడంతో స్నేహితులు ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు, రూ.35 వేల విలువ గల ఇంజెక్షన్ చెయ్యాలంటూ వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఇంజెక్షన్ చేయించారు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పటంతో తీసుకెళ్లగా అక్కడ రాత్రే చనిపోయినట్లు చెప్పటంతో ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola