CM YS Jagan Back to Andhra Pradesh | లండన్ పర్యటన ముగించి ఏపీకి చేరుకున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన విదేశీ పర్యటనను ముగించారు. లండన్ నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరంలో ఎయిర్‌పోర్టులో దిగిన వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన విదేశీ పర్యటనను ముగించారు. లండన్ నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరంలో ఎయిర్‌పోర్టులో దిగిన వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లండన్‌ పర్యటన నిన్నటితో ముగిసింది. ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్న వైసీపీ అధినేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 15 రోజుల పాటు లండన్‌లో ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తైన తర్వాత మే 17 జగన్ ఫారెన్ టూర్‌కు వెళ్లారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో తిరిగారు. పర్యటన ముంగించుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం స్వాగతం పలికింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola