CM Chandrababu Naidu Visits Tirumala | సీఎంగా కొండపై అడుగుపెట్టనున్న చంద్రబాబు

Continues below advertisement

 

నాల్గోవ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం..నేరుగా తిరుమలకు రానున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల కొండకు వచ్చి.. శ్రీవారిని దర్శించుకోనున్నారు

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు రికార్డు సృష్టించారు.

 

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో, జేపీ నడ్డా, ఇతర రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిరథ మహారథులు కదలివచ్చిన వేళ ప్రమాణస్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

 

అక్కడ ఆయన చంద్రబాబు అభినందిస్తూ పూలబొకేను అందించారు. అనంతరం చంద్రబాబు ఆయన్ని కౌగిలించుకొని ఎమోషన్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా వీఐపీ గ్యాలరీ వైపుగా వెళ్లి అక్కడ కూర్చొని ఉన్న అమిత్‌షా, వెంకయ్య, జేపీ నడ్డా, ఇతర ప్రమఖులకు అభివాదం చేశారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram