హిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

బీజేపీ నేత మాధవీ లత తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. తిరుమల లడ్డు వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆమె తిరుమలకు వచ్చారు. ధర్మాన్ని పరిరక్షించాలని, అది గుర్తు చేయడానికే వచ్చానని చెప్పారు మాధవీ లత. హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో హిందువులంతా ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరి ధర్మాన్ని వాళ్లు కాపాడుకోవాలని అన్నారు. హిందూ ధర్మాన్ని కించపరచాలని చూస్తున్న రాక్షసులను స్వామి వారు సంహరించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు అలిపిరి మెట్ల మార్గం ద్వారా మాధవీ లత...తిరుమలకు వచ్చారు. తిరుమల అపవిత్రం అయిందని,అందుకే ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్టు చెప్పారు. హిందువులు ఇప్పుడు మేల్కోకపోతే...ముందు ముందు ఇంకెన్నో అపచారాలు జరుగుతాయని హెచ్చరించారు. వైస్ జగన్ తిరుమల ఆలయంలో కాకుండా...ఏదైనా చర్చ్‌కి వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తేల్చి చెప్పారు. మాధవీ లతతో పాటు బీజేపీ నేత భాను ప్రకాశ్ కూడా వెంకన్న స్వామి వారిని దర్శించుకున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola