Attack On JC Asmith Reddy In Tadipatri: వైసీపీ శ్రేణుల పనేనంటూ టీడీపీ ఆరోపణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. పట్టణంలోని మూడో వార్డులో ఆయన పర్యటిస్తుండగా ఈ దాడి జరిగింది.