దేశంలోనే అరుదైన ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న అరసవల్లి

Continues below advertisement

ప్రభాత వేళలో ప్రత్యక్షమై ప్రపంచానికి మేలు కొలిపే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. సకల లోకాలకు తన వెలుగుల ద్వారా దివ్యతేజస్సును ప్రసాదించే దేవ దేవుడు.... అరసవల్లి సూర్యనారాయుడు. ఆయన కొలువైన ప్రదేశం శ్రీకాకుళం. ఈ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి భక్తులకు అభయప్రదానం చేస్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా ఇక్కడ కనువిందు చేస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం గోచరిస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీలు, అలాగే దక్షిణాయనంలో అక్టోబరు 1, 2 తేదీల్లోనూ సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram