Bopparaju Venkateswarulu : కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఉద్యోగులను విస్మరిస్తోంది | ABP Desam
కర్నూలులో ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవటంతో ఈ రోజు నుంచే ఉద్యమం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారన్న ఆయన ఉద్యమం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. జనవరి ఆరో తేదీవరకూ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామన్న బొప్పరాజు ఉద్యోగుల మంచితనాన్ని చులకనగా చూడొద్దన్నారు.