Heavy Rains: వానలే వానలు.. పొంగుతున్న వాగులు, వంకలు
తూర్పుగోదావరి జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. వర్షానికి పొంగుతున్న వాగులు వంకలు.. దాంతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భూపతిపాలెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చింతూరు, వి.ఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఏ. జి కోడెర్, జల్లివారి గూడెం మధ్య ఉన్న చంద్రవంకవాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నవరం, ఉమ్మడివరము మధ్య వంతెన తెగి పోవడంతో పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.