AP Inter exams 2022: స్టూడెంట్స్ కి సమస్య వచ్చింది.. ఎగ్జామ్ సెంటరే కదిలొచ్చింది | Asani Cyclone

అసని తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్ష రద్దయింది. అయితే గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నెల్లూరులో వాగు అడ్డు రావడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి రాలేకపోయారు. అయితే స్థానిక తహశీల్దార్, కలెక్టర్ చొరవతో.. ఎగ్జామ్ సెంటరే వారి దగ్గరకు కదిలొచ్చింది. దీంతో వారి కష్టాలు తీరాయి. పరీక్ష మిస్ అయిపోతామేమోనన్న భయంతో ఇబ్బంది పడ్డ ఇంటర్ స్టూడెంట్స్.. చివరకు సంతోషంగా పరీక్ష రాశారు. తహశీల్దార్ కృష్ణప్రసాద్, కలెక్టర్ చక్రధర్ బాబుకి students కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola