Kotiya Village: ఏపీలో ఉంటామని కొటియ గ్రామస్తుల తీర్మానం, ఒడిశాపై పైచేయి

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని తీర్మానించాయి. ఏపీ ప్రభుత్వ పథకాలతో తాము లబ్ధిపొందామని, చచ్చినా, బతికినా ఇక్కడే ఉంటామని నిర్ణయించాయి. ఆ తీర్మాన పత్రాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ సూర్యకుమారికి దాదాపు 55 మంది గిరిజనులు అందించారు. కొటియా గ్రామస్థులకు స్వాగతం పలికిన అధికారులు.. వారిని సన్మానించి భోజనాలు ఏర్పాటు చేశారు. ఒడిశా పోలీసులు బెదిరిస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. శాంతియుత పరిష్కారానికే యత్నించామని జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola