CM Jagan PRC: పీఆర్సీ పై తిరుపతి లో సీఎం కీలక ప్రకటన.
ఏపీలో ఉద్యోగుల ఆందోళనలో కొత్త మలుపు తిరిగింది. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ తిరుపతిలో తనను కలిసిన ఉద్యోగులకు తెలిపారు.ఉద్యోగులకు సంబంధించి పే రివిజన్ కమిషన్ సిఫార్సులు ప్రక్రియ పూర్తయిందని పది రోజుల్లో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తిరుతిలో వరద ప్రాంతాల పర్యటనలో ఉన్న ఆయన వద్దకు కొంత మంది ఉద్యోగులు వెళ్లారు. వారితో మాట్లాడుతూ పీఆర్సీ సమస్యను పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.