Amaravathi farmers JAC రెండురోజుల విరామం అనంతరం యాత్ర మొదలు పెట్టారు

అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకున్న 24గంటల్లోగా పాదయాత్రను నెల్లూరు జిల్లా పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. పాదయాత్రలో దేవుడి రథంకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఉదయాన్నే నెల్లూరు శివారులోని అంబాపురం శాలివాహన ఫంక్షన్ హాల్ నుంచి పాదయాత్ర రైతులు బయలుదేరారు. రెండురోజుల విరామం అనంతరం యాత్ర మొదలు పెట్టారు. టెంకాయ కొట్టి పూజలు చేసి అక్కడినుంచి బయలుదేరారు. టీడీపీ నేతలు కూడా వారితో జతకలిశారు. అయితే అంతలోనే పోలీసులు అక్కడికి వచ్చి రైతుల్ని అడ్డుకున్నారు. యాత్రలో దేవిడి రథంకు అనుమతి లేదన్నారు. దీంతో కాసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. చివరకు రైతులు ముందుగా నడచి వెళ్లేట్లు.. కాస్త గ్యాప్ తీసుకుని ఇతర వాహనాలు వెళ్లేట్లు ఒప్పందం కుదరడంతో రైతులు ముందుకు కదిలారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola