Ratnagiri Wells : ఆ బావి లో మునిగితే సంతాన ప్రాప్తి | ABP Desam
ABP Desam
Updated at:
16 Jun 2022 12:57 AM (IST)
దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో పదహైదు శతాబ్దాలుగా కొన్ని బావులు ఎండిపోకుండా ఇప్పటికీ నీటిని కలిగి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండలంలోని రత్నగిరి గ్రామంలో ఇప్పటికీ నీటి శుద్ధి ప్లాంట్ లేదు. నీటి క్యాన్లను కొనుగోలు చేసి వినియోగించరు. కారణం 15 శతాబ్దాల క్రితం తవ్విన చేదబావుల లోని నీటినే ఆ గ్రామస్తులు వినియోగిస్తున్నారు. ఇలాంటి చేదబావులు గ్రామంలో 12 ఉన్నాయి .