Amaravati Roads Damage|అమరావతిలో రోడ్లు ధ్వంసం చేస్తున్న దుండగులు| DNN | ABP Desam
ఏపీ రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం నిర్మించిన రోడ్లు ధ్వంసం చేసి కొందరు అక్రమార్కులు, మట్టి, గ్రావెల్, కంకర, ఇసుకను తరలించుకుపోతున్నారు. మందడం, సమీపంలో గత ప్రభుత్వంలో నిర్మించిన రహదారిని దుండగులు ధ్వంసం చేశారు. మట్టి తవ్వకాలు, రహదారుల విధ్వంసం జరిగిన ప్రాంతం రాష్ట్ర సచివాలయానికి ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న రహదారులను దుండగులు తవ్వుతుండగా.. ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తారు రోడ్లనూ ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది.