Breaking News Live: రుషికొండ బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 12 Mar 2022 09:05 PM
Background
ఢిల్లీలోని గోకుల్ పురిలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. శివార్లలోని గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. గుడిసెలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణ నష్టం అధికంగా వాటిల్లినట్లు తెలుస్తోంది. నిద్రపోతున్న సమయం కనుక, మంటల్ని త్వరగా...More
ఢిల్లీలోని గోకుల్ పురిలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. శివార్లలోని గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. గుడిసెలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణ నష్టం అధికంగా వాటిల్లినట్లు తెలుస్తోంది. నిద్రపోతున్న సమయం కనుక, మంటల్ని త్వరగా గుర్తించక పోవడంతో పెను నష్టాన్ని మిగిల్చింది అగ్ని ప్రమాదం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఎంగానో శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. చిన్నారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్లకు ఎగబాకింది. హైదరాబాద్లో ఇంధన ధరలు గత ఏడాది డిసెంబర్ నుంచి నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్లో నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్లో 19 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్పై 17 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 కు పతనమైంది. నిజామాబాద్లోపెట్రోల్ లీటర్ ధర రూ.109.93 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.96.23 అయింది. ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 12th March 2022)పై 40 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.48 కాగా, ఇక్కడ డీజిల్ పై 37 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.56 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. 48 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్పై 44 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.51కి పతనమైంది.మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళలు దుమ్మురేపారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ సేన ప్రత్యర్థి విండీస్ మహిళల ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్లు ఓపెనర్ స్మృతి మందాన (123), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (109) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రుషికొండ బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
పరదేశిపాలేనికి చెందిన శ్రీ రామా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన ఇద్దరు విద్యార్థులు రుషికొండ బీచ్ లో గల్లంతయ్యారు. వీరిలో 8వ తరగతి చదువుతున్న మొయ్య పార్డు(15)మృతదేహం లభ్యంకాగా 10వ తరగతి విద్యార్థి సత్యాల రాజేష్(16) గల్లంతయ్యాడు. 9వ తరగతి చదువుతున్న బాలుడు పర్రి సాయి ప్రాణాలతో బయట పడగా, అతడికి గీతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.